![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -49 లో... వినాయకుడి విగ్రహం నిమజ్జనానికి గంగ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వినాయకుడికి శకుంతల పూజ చేస్తుంది. గంగ వస్తుంటే భాను వచ్చాడనుకొని శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఇక ఇంట్లో అందరు చాలా సంతోషంగా ఉంటారు. అందరు వినాయకుడి ముందు తీన్ మార్ డాన్స్ చేస్తుంటారు. శకుంతల హ్యాపీగా ఉండడం చూసి రుద్ర సంతోషపడతాడు. ఇందుమతి డాన్స్ చేస్తుంది. వీరు ప్లాన్ లో భాగంగా తన మనిషితో రుద్రకి పాపతో రౌడీలున్న వీడియోని పంపిస్తాడు. అది చూసి రుద్ర అక్కడ నుండి బయల్దేరతాడు. రుద్ర వెళ్ళడం చూసి సైదులుకి వీరు ఫోన్ చేసి గంగ దగ్గరికి రమ్మని చెప్తాడు.
ఆ తర్వాత అందరు డ్యాన్స్ చేసి అలసిపోయి పక్కకి వస్తారు. గంగ ఇంకా కొంతమంది డ్యాన్స్ చేస్తారు. అప్పుడే సైదులు కత్తి పట్టుకొని వచ్చి.. గంగ తల దగ్గర పెట్టగా.. వెనకాల నుండి రుద్ర వచ్చి ఆపుతాడు. సైదులు తప్పించుకుంటాడు. ఈ రుద్ర మళ్ళీ ఎందుకు వచ్చాడని వీరు డిజప్పాయింట్ అవుతాడు. గంగ భయపడుతూ శకుంతల దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |